Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో చేరే గడువును రెండు రోజులు పొడిగిస్తున్నామని డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ఆర్ లింబాద్రి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దోస్త్ తొలివిడతలో సీట్లు కేటాయించిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరే గడువు షెడ్యూల్ ప్రకారం శనివారంతో ముగుస్తుందని పేర్కొ న్నారు. కానీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని డిగ్రీ కాలేజీల్లో చేరే గడువు, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టం ఆధారంగా సీటు పొందేందుకు సోమవారం వరకు అవకా శం కల్పిస్తున్నామని తెలిపారు. ఇంకోవైపు రెండో విడతకు సంబంధించి కొత్త రిజి స్ట్రేష న్ చేసుకోవడంతోపాటు వెబ్ఆప్షన్ల నమోదు గడువు సోమవారం వరకు ఉందని పేర్కొన్నారు. రెండో విడత సీట్ల కేటాయింపు ఈనెల 20న ఉంటుందని తెలిపారు.