Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలయాన్ని అపవిత్రం చేస్తావా? అంటూ పిడిగుద్దులు
- కర్నాటకలో కోరలు చాచిన కులసర్పం
మైసూరు : శాస్త్ర విజ్ఞానం ఎన్నో విజయాలు సాధించినా.. దేశంలో కుల వివక్ష, అంటరానితనం మాత్రం సమసిపోవడం లేదు. ఒక వైపు చంద్రుడిపై అడుగుపెట్టేందుకు పరిశోధనలు జరుగుతుండగా.. మరోవైపు ఆలయంలో అడుగుపెట్టినందుకు దళి తులపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా, దళి తుడు అడుగుపెట్టినందుకు ఆలయం అపవిత్రమైం దని తీవ్రంగా దాడి చేసిన ఘటన కర్నాటకలో వెలుగుచూసింది. ఆలయాన్ని మైల పరిచావంటూ కొబ్బరి చెట్టుకు కట్టేసి పిడిగుద్దులు గుద్దారు. ఊరంతా నగంగా ఊరేగించారు. కాగా.. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. వార్తలూ వెలువడలేవు. అంతేకాదు, ఐఏఎస్కు సిద్ధమవుతున్న సదరు దళితుడికి మతిస్థిమితం లేదనీ, తప్పుగా తమపై నిందలు మోపుతున్నారంటూ నిందితులు బుకాయించడం గమనార్హం. సామాజిక మాధ్యమాల్లో ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో అధికారులు దిగిరాక తప్పలేదు. చామరాజ్ నగర్ జిల్లాలోని గుండ్లుపేటకు చెందిన ప్రతాప్ పేదరికంతో పోరాడుతూనే.. డిగ్రీ పట్టాపొంది ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ ఘటనకు ఒక రోజు ముందు యూపీఎస్సీ పరీక్ష రాసేందుకు మరిమల్లప్ప వెళ్లగా.. అక్కడ పరీక్ష కేంద్రంలోకి రానీయలేదు. అనంతరం మైసూరు వెళ్లి తిరిగి గుండ్లుపేటకు వస్తుండగా.. దారి మధ్యలో రాఘవపుర దగ్గర తన బైక్లో సమస్య తలెత్తింది. అక్కడ కొందరు దుండగులు అతనిపై దాడి చేసి నగదును లాక్కెళ్లారు. భయంతో ఆ రాత్రి అక్కడే ఉండి.. పొద్దున తలదాచుకునేందుకు శనిమహాత్మ గుడిలోకి వెళ్లాడు. అక్కడే పూజారి అతని వివరాలను అడిగాడు. అంతలోనే గుమిగూడిన జనం ప్రతాప్ దళితుడని గుర్తించి చితకబాదారు. వీడికి బుద్ధి చెప్పాల్సిందేనంటూ అరుస్తూ... గుడిని తాకే హక్కు వాళ్లకు లేదని పిడిగుద్దులు కురిపించారు. కొబ్బరి చెట్టుకు కట్టేసి కొట్టారు. వస్త్రాలు చింపేసి చేతులు వెనక్కి కట్టి నగంగా ఊరేగించారు. కాగా, తమ ఆధిపత్యంతో ఈ ఘటనపై కేసు కాకుం డా.. వార్తలు రాకుండా అడ్డుకోగలిగారు. అంతేకాదు, ప్రతా ప్కు మతిస్థిమితం లేదనీ, తమను దాడి చేసినట్టు ఆరోపి స్తున్నాడనీ గ్రామస్తులే పోలీసు కేసు పెట్టడం గమనార్హం. కాగా, దళిత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయడంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ యాక్ట్, ఇతర చట్టాల కింద కేసు నమోదు చేశారు. దేశంలో దళితులపై దాడులు కొత్తేమీ కాదు గానీ, ఇప్పుడు మరింత తీవ్ర, వికృత రూపాన్ని తీసుకున్నాయని హక్కుల కార్యకర్తలు తెలిపారు. 'అంటరానితనం మూలం కులంలో ఉంది. కుల వ్యవస్థకు మూలం వర్ణ వ్యవస్థలో ఉంది. వర్ణాల మూలం రాజకీయ ఆధిపత్యంలో ఉన్నద'ని అంబేద్కర్ చెప్పిన మాటలను ఈ ఘటనలు నిరూపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.