Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహితి, పీఎన్ఎం నివాళులు
నవతెలంగాణ-హైదరాబాద్
20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి, సంప్రదాయ ఛందోబద్ద కవిత్వాన్ని ధిక్కరించిన విప్లవ కవి శ్రీశ్రీ అని ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహా అన్నారు. తెలంగాణ సాహితి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై శ్రీశ్రీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కట్టా నరసింహా మాట్లాడుతూ.. సినీ రంగంపైనా శ్రీశ్రీ తనదైన ముద్రవేశారని కొనియాడారు. తెలంగాణ సాహితి రాష్ట్ర కోశాధికారి అనంతోజు మోహన్కష్ణ మాట్లాడుతూ.. అభ్యుదయ భావాలతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైతాళికుడు శ్రీశ్రీ అన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.నరేష్ మాట్లాడుతూ.. హేతువాది, నాస్తికుడిగా శ్రీ శ్రీ నిలుస్తారని అన్నారు. ప్రజానాట్యమండలి హైదరాబాద్ నగర కార్యదర్శి ఆర్.సైదులు మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం ఏర్పడిన సిద్ధాంతాలు ఏవైనా అవి నావేనన్న గొప్ప మహానుభావుడు శ్రీశ్రీ అని తెలిపారు.