Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి టీపీయూఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేసేందుకు చొరవ చూపాలని టీపీయూఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్రెడ్డిని టీపీయూఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూరం విష్ణువర్ధన్రెడ్డి, హన్మంతరావు ఆదివారం హైదరాబాద్లో కలిసి వినతిపత్రం సమర్పించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు నిబంధనల సమస్యను ఎన్డీయే ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించడం వల్ల రాష్ట్రపతి ఉత్తర్వులపై స్టే విధించిందని తెలిపారు. ఆ తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో ప్రత్యేకంగా సీనియర్ న్యాయవాదిని నియమించి ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చూస్తామని కిషన్రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు.