Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐకేపీ సీసీ, వీఓలను నిర్బంధించిన అన్నదాతలు
నవతెలంగాణ-మల్యాల
ఆరుగాలం కష్టపడి పండించి కొనుగోలుకు తీసుకువచ్చిన ధాన్యంలో అధికారులు అదనంగా కోత విధించారని రైతులు ఆగ్రహించారు. దీంతో గ్రామానికి వచ్చిన ఐకేపీ సీపీ అశోక్, వీఓలను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపల్లిలో ఆదివారం జరిగింది. కొంతమంది రైతులు ధాన్యం డబ్బులు ఇంత వరకూ బ్యాంకులో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ఉద్యోగి ఫోన్ ద్వారా జిల్లా అధికారులకు సమాచారం అందించారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి అధికారిని విడిపించారు. ఈ సందర్బంగా అధికారి మాట్లాడుతూ.. నష్టపోయిన ధాన్యంలో రెండు వంతులు వీవో సంఘం, ఒక వంతు రైతులు చెల్లించాలని అప్పుడే తెలిపామని చెప్పారు. నష్టం వాటిల్లిందన్న ఆవేదనలో అలా చేశారని గ్రామస్తులు తెలిపారు.