Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యం అందక వ్యక్తి మృతి
- ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
నవతెలంగాణ - నల్లగొండ టౌన్
వైద్యులు సమ్మెలో ఉండటంతో.. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన రోగికి సరైన వైద్యం అందక, ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ సదుపాయం లేక వ్యక్తి మృతిచెం దాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. కనగల్ మండలం మారెపల్లి గౌరారం గ్రామానికి చెందిన అన్నభీమోజు నర్సింహాచారి ఆయాసంతో ఇబ్బంది పడుతుంటే కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు సెలైన్ ఎక్కించారు. సోమవారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేదని, మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సిబ్బంది సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని పలు ప్రయివేటు ఆస్పత్రులకు తీసుకెళ్లినా సమ్మె కారణంగా వైద్యులెవరూ అందుబాటులో లేకుండా పోయారు. తిరిగి ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా, పరిస్థితి విషమించి నర్సింహాచారి మృతిచెందాడు. వైద్యుల సమ్మె వల్లే నర్సింహాచారి మృతిచెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు.