Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విడుదల చేయాలి: రావుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నీటి ప్రాజక్టులకు ప్రతిపక్షాలు అడ్డు కాదని, కాళేశ్వరం ప్రాజక్టు డీపీఆర్ను ప్రజల ముందు పెట్టాలని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని ఎన్టీఆర్భవన్లో మీడియాతో మాట్లాడుతూ ప్రాజక్టు డిజైన్ మార్చినప్పుడు నీటి లభ్యత పెరగాలని... కానీ అలా జరగడం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజక్టుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ సహా పార్టీ ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించినా తప్పేనని, బీజేపీ ప్రాంతీయ పార్టీలను చంపేస్తున్నదని రావుల మండిపడ్డారు. బీజేపీ పేరుకే జాతీయ పార్టీ అని, దానిది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సిద్ధాంతమని విమర్శించారు. బీజేపీతో కలిసి పనిచేసిన పార్టీలు బతికి బట్టకట్టలేవని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పేదల పార్టీ అని, నాయకులు వెళ్ళిపోయినా.. తిరిగి తయారు చేసుకోగలమని అన్నారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని, టీడీపీని వీడాలనుకునేవారు పునరాలోచించుకోవాలని రావుల చంద్రశేఖర్రెడ్డి సూచించారు.