Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు కార్మికులు మృతి
నవతెలంగాణ - మేళ్లచెరువు
ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మట్టి పెల్లల కిందపడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం మైహోం సిమెంట్ ఫ్యాక్టరీలో మంగళవారం జరిగింది. మఠంపల్లి మండలం వెంకటాయపాలెం వ్యక్తి తాళ్లూరి లకీëనారాయణ(45), మేళ్లచెరువు మండలం వేపల మాదారానికి చెందిన షేక్ బుడెన్(43) మై హోం సిమెంట్ పరిశ్రమలో ల్యాటరైట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం విధుల్లో భాగంగా ఎర్రమట్టిని నిల్వ చేసే ఆఫర్లోకి(గుమ్మి) దిగారు. వీరితో పాటు మరో ముగ్గురు కూడా దిగారు. షేక్ బుడెన్, లకీëనారాయణ ఆఫర్ అడుగు భాగంలోకి వెళ్లి ఇరువైపులా ఉన్న ఎర్ర మట్టిని తొలగిసుండగా పైనుంచి ఒక్కసారిగా ఎర్రమట్టి పడింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని కోదాడ రూరల్ సీఐ రవి సందర్శించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.