Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పత్తి మొలకలను దున్నిన వైనం
నవతెలంగాణ-ముత్తారం
తీసుకున్న అప్పు తీర్చలేదని మొలకెత్తిని పత్తి చేనును దున్నేశారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఇప్పలపల్లిలో మంగళవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పలపల్లికి చెందిన సత్తయ్య-దేవమ్మ దంపతులు తమ మూడెకరాల్లో పత్తి వేశారు. సంవత్సరం కిందట గ్రామానికి చెందిన సూర రాజేశ్ వద్ద పెట్టుబడి కోసం రూ.లక్ష అప్పు తీసుకున్నారు. కొన్ని నెలల తరువాత రూ.50 వేలు చెల్లించారు. ఈ క్రమంలో రాజేశ్ అనారోగ్యంతో చనిపోయాడు. అనంతరం సత్తయ్య రూ.లక్ష తీసుకున్నట్టు మాత్రమే తెలిసిన రాజేశ్ కుటుంబ సభ్యులు అప్పు తీర్చాలని పట్టుబట్టారు. తాము రూ.50 ఇప్పటికే రాజేశ్కు ఇచ్చామని చెప్పినా వారు వినలేదు. మంగళవారం సత్తయ్య సాగు చేస్తున్న పత్తి చేనును ట్రాక్టర్తో దున్నారు. విషయం తెలుసుకుని చేనుకు వచ్చిన సత్తయ్య దంపతులు ధ్వంసమైన పైరును చూసి బోరున విలపించారు. రాజేశ్ కుటుంబసభ్యులైన రాధ, రాకేశ్, మణెమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ అంజయ్య విచారణ చేపట్టారు.