Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్
నవతెలంగాణ-రాంనగర్
కనీస వేతనాల జీవోలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'కనీస వేతనాల జీవోలను సవరణలు.. వాటి అమలుపై ఉద్యమిద్దాం' అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. కార్మికులు అధికార పార్టీల రాజకీయ భ్రమలు వదిలిపెట్టి కార్మిక సంఘాలతో కలిసి పని చేయాలన్నారు. ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలకు వందల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తాయి కానీ కార్మికులకు వేతనాలు పెంచడానికి వెనకడుగు వేస్తున్నాయని విమర్శించారు. దేశంలో రూ.10 వేల వేతనం దాటని వారు 57 శాతం మంది ఉన్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం జీవో నెంబర్ 70 సవరించకుండా పెండింగ్లో పెట్టిందన్నారు.ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం మాట్లాడుతూ.. కార్మికుల పోరాటం ఫలితంగా సాధించుకున్న కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. 23న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట కనీస వేతనాల అమలు డిమాండ్ చేస్తూ ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు కష్ణ, ఉపాధ్యక్షులు పద్మ, రాజన్న రాష్ట్ర సహాయ కార్యదర్శులు రామయ్య, జనార్ధన్ వెంకటేశ్ రాష్ట్ర నాయకులు ప్రవీణ్, అరుణ, కిరణ్, వెంకన్న నరేశ్ తదితరులు పాల్గొన్నారు.