Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోట్లాదిమంది ఉపాధికి వ్యవసాయ సంక్షోభం దెబ్బ..
- అన్నదాతను వేధిస్తున్న రుణ భారం, మద్దతు ధర
- ఉపాధి కోల్పోయిన మహిళలు 2.47 కోట్లు
- వేరేపనుల కోసం పట్టణాలకు వలస: పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే
గ్రామాల్లో వ్యవసాయం చేసుకునే రైతు పట్టణాల్లో లేబర్ అడ్డాల దగ్గర నిలబడుతున్నాడు. భవన నిర్మాణాల్లో కూలీ చేసుకుంటున్నాడు. గ్రామాల్లో ఉపాధి కోల్పోయిన మహిళలు పట్టణాల్లో ఇంటి పనిమనిషిగా మారుతున్నారు. చిన్న చిన్న పరిశ్రమల్లో 'స్వీపర్'గా బతుకుతున్నారు. వీళ్లంతా వ్యవసాయాన్ని వదిలేసుకొని రాలేదు. వ్యవసాయమే వీరిని వదులుకుంది. కారణం సంక్షోభంలో చిక్కుకున్న గ్రామీణ వ్యవసాయరంగం. 2కోట్లా 47లక్షల మంది గ్రామీణ మహిళలు ఉపాధిని కోల్పోయారనీ 'పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే- 2017-18' లెక్క తేల్చింది.
మహిళలకు ఉపాధి కష్టాలు..
2011-12 నాటికి దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో ఉపాధి పొందుతు న్నవారి సంఖ్య 47.25 కోట్లు. ఇది 2017 -18 నాటికి 47.13 కోట్లకు పడిపోయింది. 'పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే' తాజా గణాంకాల ప్రకారం వ్యవసాయరంగంలో ఉపాధి కోల్పో యిన వారి సంఖ్య 12లక్షల మంది. ఇదంతా కూడా ప్రాథమిక (ప్రిలిమినరీ) స్థాయి అంచనా. పురుషుల కంటే మహిళలు పెద్ద సంఖ్యలో ఉపాధికి దూరమవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాదిమంది మహిళల కు వ్యవసాయ ఉపాధి దూరమైంది. 2011-12లో గ్రామాల్లో ఉపాధి పొందిన మహిళల సంఖ్య 10.16కోట్లు. కాగా 2017-18నాటికి ఈ సంఖ్య 7.7కోట్లకు పడిపోయింది.చేరిందన్న విషయం కేంద్రం దాచాలని చూసింది. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తటంతో నిరుద్యోగం, ఉపాధిపై 'జాతీయ గణాంక సంస్థ'(ఎన్ఎస్సీ) రూపొందించిన గణాంకాలు బయటకొచ్చాయి. అలాగే వ్యవసాయరంగంలో ఉపాధి గురించి 'పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే'(పీఎల్ఎఫ్ఎస్) కొన్ని కీలకమైన అంశాలు సేకరించింది. వ్యవసాయ సంక్షోభం కారణంగా ఈ రంగంలో 12లక్షలమంది ఉపాధి కోల్పోయారని సర్వే తేల్చింది. పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు జీవనోపాధి కోసం మరో పట్టణాలకు వెళ్లి, వ్యవసాయేతర పనుల్ని వెతుకుంటునట్టు తెలింది.
సమస్యలన్నింటికీ పరిష్కారం నగదు బదిలీ!
రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించటం, రుణ విముక్తి...వంటివి గ్రామాల్లో ఉపాధిని మెరుగుపరుస్తుందని ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 'రైతుబంధు', 'కిసాన్ సమ్మాన్' వంటి పథకాల ద్వారా ఇచ్చే నగదు లబ్ది, రైతాంగం సమస్యలను పరిష్కరించవని వారు అంటున్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బంధీగా అమలుచేయటం ద్వారా, గ్రామాల్లో మౌలిక వసతలు కల్పన మెరుగుపడుతుందనీ, అదేసమయంలో కర్షకులకు ఉపాధి దక్కుతుందనీ వారు సూచించారు.అంతకుముందు గణాంకాలతో పోల్చితే పట్టణాల్లో పురుషుల ఉపాధి పెద్దగా మెరుగుపడలేదనే చెప్పాలి. తాజా సర్వే ప్రకారం, అంతక్రితం పట్టణపురుషుల్లో ఉపాధి పెరుగుదల కోటీ 76లక్షలుంటే, అదిప్పుడు (2011-18మధ్యకాలం) కోటీ 47లక్షలకు పరిమితమైంది. అంటే పురుషుల్లో ఉపాధి కల్పన తగ్గింది. 2004-05 నాటితో పోల్చుకుంటే 2011-12నాటికి గ్రామీణ ఉపాధిలో పెరుగుదల కోటీ 47లక్షలు. ఇది 2017-18నాటికి 'మైనస్ 12లక్షల'ను నమోదుచేసింది.
వర్షాలు ఏమేరకు పడతాయో వాతావరణ శాస్త్రవేత్తకు సైతం తెలియని పరిస్థితి. కాలం అయితదో లేదో...అనే ఆందోళనలో దేశ రైతాంగమంతా ఉంది. మద్దతు ధర వస్తదో లేదో తెలియదు. మరోవైపు ప్రతీ ఏటా పెరుగుతున్న రుణ భారం. ఇంక వ్యవసాయాన్ని నమ్ముకోలేమని రైతులు, గ్రామీణ మహిళలు వేరే పనులవైపు వెళ్తున్నారు. ఈ పరిణామాలు కోట్లాదిమందికి ఉపాధిని దూరం చేసింది. ఇందులో గ్రామీణ మహిళలు ఎక్కువగా నష్టపోయారు.
సంవత్సరం గ్రామాల్లో-పురుషులు గ్రామాల్లో-మహిళలు పట్టణాల్లో-పురుషులు పట్టణాల్లో-మహిళలు మొత్తం కార్మికులు
2017-18 23.90 7.7 12.38 31.5 47.13
2011-12 23.34 10.16 10.91 27.4 47.25
మార్పు 4.6 -2.47 1.47 0.41 -0.12