Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ లేదు...కాంగ్రెస్ పని ఖతం :
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖతమైందని, సీఎల్పీ లేదని, ఇక రాష్ట్రంలో బీజేపీకే మంచి భవిష్యత్తు ఉందని, టీఆర్ఎస్కు ఆ పార్టీయే ప్రత్యామ్నా యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. శాసనసభ ప్రత్యేక సమావేశాల సందర్భంగా గురువారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని అన్నారు. కాంగ్రెస్ లో నాయకత్వ లోపముందని, ఈ విషయాన్ని పలు మార్లు పార్టీ అంతర్గత సమావేశాల్లో లేవనెత్తినట్టు చెప్పారు. నాయకత్వ లోపం కారణంగానే ప్రజలు ప్రతిపక్ష పార్టీగా 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే అందులో 12 మందితో సీఎల్పీ టీఆర్ఎస్ లో విలీనమైందన్నారు. ఓటమికి నైతిక బాధ్యత వహించి పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ రాజీనామా చేసినట్టే రాష్ట్ర నాయకత్వం రాజీనామా చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన, తానింకా కాంగ్రెస్ పార్టీని వీడలేదని, సాంకేతిక అంశాలున్నాయని, సమయం వచ్చినప్పుడు నిర్ణయం చెబుతానని అన్నారు. తాను యూ టర్న్ తీసుకున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తానెలాంటి టర్న్ లు తీసుకోలేదన్నారు.