Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ- వనపర్తి
ప్రభుత్వం విద్యార్థినులకు అందించిన ఐరన్ మాత్రలు వేసుకున్న 39 మంది విద్యార్థినులు అస్వస్థ తకు గురయ్యారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో గురువారం జరిగింది. ఉపా ధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి మండలం సవాయిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతి గురువారం విద్యార్థినులకు ఐరన్ మాత్రలు సరఫరా చేస్తున్నారు. అందులో భాగంగానే ఉదయం 11 గంటలకు 63 మందికి ఈ మాత్రలు వేశారు. అయితే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడుతూ ఏడుస్తుండగా ఉపాధ్యాయులు గమనించారు. వెంటనే 104 అంబులెన్స్కు సమాచారం ఇచ్చి 39 మందిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏ.శ్రీనివాసులు ఆస్పత్రికి వచ్చి విద్యార్థినులను పరామర్శించారు. ఐరన్ మాత్రలు వేసుకునే సమయంలో భోజనం చేసి ఉండాలన్నారు. ఖాళీ కడుపుతో మాత్రలు వేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు.