Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, మరణించిన వాళ్ల కుటుంబ సభ్యులకు మోటారు వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్) కింద ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. ఆ చట్టంలోని 158(6) సెక్షన్ అమలుపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అక్తర్లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. యాక్సిడెంట్ అవ్వగానే ప్రమాద బీమా ట్రిబ్యునల్కు వివరాలు అందిస్తున్నాం. ప్రతి నెలా అన్ని జిల్లాల నుంచి పట్టిక రూపంలో వివరాలిస్తున్నాం. ఆరు మాసాల్లో తెలంగాణలో 10,980 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. ఈ ప్రమాదాల్లో 3,790 మంది చనిపోతే 11 వేల మంది గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల్లో రాచకొండ, సైబరాబద్ కమిషనరేట్లు వరసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రమాదాల్ని తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. క్క్రెం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టంను ఏర్పాటు చేసి ప్రమాదం జరిగిన వెంటనే ట్రిబ్యునల్కు సమాచారం అందించే సాంకేతిక వ్యవస్థను అమల్లోకి తీసుకోబోతున్నాం... అని డీజీపీ తరఫున ప్రభుత్వ ప్రత్యేక లాయర్ హైకోర్టుకు చెప్పారు.