Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్ ఎదుట రైతుల ఆందోళన
నవతెలంగాణ - కోదాడరూరల్ / వైరాటౌన్
పట్టా పాస్పుస్తకాల కోసం ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట రైతులు సోమవారం ఆందోళన చేశారు. కోదాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో కూచిపూడి, దొరకుంట, తుమ్మర రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లంచం ఇవ్వనిదే అధికారులు పనిచేయడం లేదని, ఇచ్చినా మరిన్ని డబ్బుల కోసం కార్యాలయం చుట్టూ తిప్పికుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ఆందోళనలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడారు.రైతుల స్వాధీనంలో ఉన్న భూమికి పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని, తప్పులు సవరించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన భూసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంప ిణీ కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా ఉందని విమర్శిం చారు. పాస్ పుస్తకాల్లో తప్పులు సరిచేయడంలో రెవెన్యూ అధికారులు విఫలమ య్యారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు నూతన సచివాలయం నిర్మించడంలో ఉన్న ఉత్సాహం రైతుల సమస్యల పరిష్కారంలో లేదన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, లేనిచో రైతులను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన నిర్వహి స్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.