Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కంది
సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని జిల్లా జైలులో సోమవారం మహిళా ఖైది ఆత్మహత్య చేసుకుంది. జైలు సూపరింటెండెంట్ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం. తన ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన కేసులో చింతల సరోజ(24) గత నెల 12న జిల్లా జైలుకు రిమాండ్ ఖైదీగా (ఫుట్ నెంబర్ 6176) వచ్చారు. ఆమె సోమవారం మధ్యాహ్నం 3.20గంటల సమయంలో బాత్రూంకు వెళ్లింది. అక్కడ చీరతో ఉరేసుకుంది. జైలు మహిళా సిబ్బంది గమనించి వెంటనే సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతిచెందింది.