Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్ అర్బన్
తన ఉద్యోగం తనకు ఇప్పించాలని ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంఎన్ఓగా పనిచేసిన బత్తుల గణేష్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంపైకి ఎక్కాడు. ప్రజావాణిలో భాగంగా సోమవారం అక్కడికి చేరుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలం మల్యాల గ్రామానికి చెందిన బత్తుల గణేష్కు 2018 ఫిబ్రవరిలో ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో ఎంఎన్ఓగా ఉద్యోగం వచ్చింది. విధుల్లో చేరిన రెండ్రోజేలకే నోటిఫికేషన్ రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఏజెన్సీకి బదులు నాన్ ఏజెన్సీలో ఉద్యోగం ఇస్తామని చెప్పి, ఏడాదిగా తిప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆవేదనకు గురై కలెక్టరేట్కు వచ్చి భవనంపైకి ఎక్కాడు. పోలీసులకు సమాచారం వెళ్లడంతో వెంటనే చేరుకుని అతన్ని కిందకు దింపారు. డబ్బులు తీసుకుని ఇతరులకు పోస్టింగ్ ఇచ్చారని బాధితుడు వాపోయాడు. డీఆర్ఓ నటరాజ్ వివరాలు తెలుసుకుని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. తగు చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో గణేష్ శాంతించాడు.