Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యామంత్రి జగదీశ్రెడ్డికి ఆహ్వానం
- లండన్లో బ్రిటీష్ కౌన్సిల్తో ఉన్నత విద్యామండలి ఒప్పందం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ విద్యాసదస్సు 2020 జనవరి 21,22 తేదీల్లో లండన్ నగరంలో జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు విద్యాశాఖ మంత్రి జి జగదీశ్రెడ్డికి ఆహ్వానం అందింది. సోమవారం హైదరాబాద్లో బ్రిటీష్ కౌన్సిల్ ప్రతినిధి బృందం జగదీశ్ రెడ్డితో సమావేశమైంది. ఈ సమావేశంలో బ్రిటీష్ కౌన్సిల్ దక్షిణ భారత డైరెక్టర్ జానకి పుష్పనాథన్తోపాటు ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మెన్లు ఆర్ లింబాద్రి, వి వెంకటరమణ, సభ్యుడు ఓ నర్సింహారెడ్డి ఉన్నారు. లండన్లో జరిగే విద్యాసదస్సుకు విద్యామంత్రితోపాటు విద్యాశాఖ అధికారులు, ఉన్నత విద్యామండలి ప్రతినిధి బృందం హాజరు కానుంది. ఈ సమావేశంలో బ్రిటీష్ కౌన్సిల్తో ఉన్నత విద్యా మండలి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మెన్ పాపిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగు ణంగా అధ్యాపకులకు బ్రిటీష్ కౌన్సిల్ నుంచి శిక్షణ ఇస్తారని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు ఫ్యాకల్టీ ఎక్ఛ్సేంజ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అధ్యాప కులు, విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు వివిధ కార్యక్రమాలు, సెమినా ర్లు, సింపోజియంలు చేపడతామని తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచ డానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు దోహదపడేలా చర్యలు తీసుకుం టామని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. అంతకుముందు ఎంహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ బిపి ఆచార్య, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్రంజన్, విద్యాశాఖ కార్యదర్శి బి జనార్ధన్రెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ను బ్రిటీష్ కౌన్సిల్ దక్షిణ భారత డైరెక్టర్ జానకి పుష్పనాథన్ కలిశారు.