Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భెల్ కంపెనీ ముందు సీఐటీయూ నిరసన
నవతెలంగాణ - రామచంద్రాపురం
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయొద్దని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని భెల్ కంపెనీ మెయిన్ గేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ భెల్ కంపెనీ అధ్యక్షులు రమణమూర్తి మాట్లాడుతూ.. భెల్లో 5 శాతం వాటా పేరుతో ఓఎఫ్ఎస్ ప్రకారం అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలను నిర్వీర్యం చేసే ఈ పద్ధతిని ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో భెల్ కంపెనీ పరిరక్షణకు, కార్మికుల శ్రేయస్సు కోసం ఆహర్నిషలూ కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెంటయ్య, శ్రీనివాస్, భాషా, కుమారస్వామి, ప్రభాకర్, రమేశ్, సతీష్, వీరణ్రావు తదితరులు పాల్గొన్నారు.