Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేరగాళ్ళకు మోడీ వత్తాసు
- 'నవ తెలంగాణ'తో విద్యార్థుల మనోగతం
నవతెలంగాణ - సిటీబ్యూరో
అవినీతిలో కాంగ్రెస్, బిజెపి ఒక తాను ముక్కలేనని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నేరగాళ్ళకే ప్రధాని నరేంద్రమోడీ వత్తాసు పలుకుతున్నారు. దేశంలో అవినీతి లేకుండా చేస్తామని ఎన్నికల సమయంలో ప్రగాల్భాలు పలికిన బిజెపి అందలమెక్కిన తర్వాత మాటమార్చింది.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే విదేశాల్లోని స్విస్బ్యాంకులో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని అన్ని ప్రచార వేదికల్లో మోడీ సహా నేతలందరూ వాగ్దాన బాణాలు సంధించారు. బిజెపి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా అసలు నల్లధనం ఊసే ఎత్తడం లేదు. యుపిఎ - 2 సర్కార్ 2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్, తదితర కేసుల్లో కురుకుపోయి అధికారాన్ని కోల్పోయింది.
ప్రస్తుతమున్న బిజెపి కూడా తామేమీ తక్కువ తినలేదని వ్యాపం కుంభకోణం, లలిత్ మోడీ వీసా వ్యవహారం వంటి కేసుల్లో ముద్దాయిగా దేశ ప్రజానీకం ముందు నిలుచుంది. దీనికి తోడు బిజెపి కేవలం ధనిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని పథకాల రూపకల్పన చేస్తుందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ లాంటి పథకాలు కేవలం పట్టణాలకే పరిమితమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏదో నామమాత్రపు పథకాలు ప్రవేశపెట్టింది. విద్యా విధానంలోనూ కీలకమైన మార్పులు తీసుకువస్తున్నారు. ఈ తరుణంలోనే ఎన్డిఎ సర్కార్ పాలనపై 'నవ తెలంగాణ' పలు యూనివర్సిటీ విద్యార్థులను పలకరించింది. వారి స్పందన వారి మాటల్లోనే..
నల్లధనం ఎప్పుడు తెస్తారు:
బి. భిక్షపతి, పిహెచ్డి స్కాలర్, జెఎన్టియుహెచ్
బిజెపి అధికారంలోకి రాకమునుపు విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వంద రోజుల్లో తీసుకొస్తామని ప్రగల్భాలు పలికింది. కానీ, ఏడాది దాటినా నల్లధనం మాటే ఇప్పుడు మాట్లాడటం లేదు. అధికారంలోకి రాక ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరోమాట. ఇది మంచి పద్ధతి కాదు.
మెజార్టీ ఉన్నదనే ధీమాతోనే
- రాఘవేందర్, ఎంటెక్, జెఎన్టియుహెచ్
కేంద్రంలో తొలిసారిగా పూర్తి మెజార్టీ తో బిజెపి అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు ఏం చేసినా ఎదురు ప్రశ్నించే వారే లేరనే ధీమాతో ఇష్టం వచ్చినట్లు బిల్లులు తెస్తుంది. సుష్మాస్వరాజ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతిపై గట్టిగా మాట్లాడారు. ప్రస్తుతం ఆమే అవినీతిలో కూరుకుపోయారు. దీనిపై బిజెపి ఆత్మవిమర్శ చేసుకోవాలి.
పెద్దోళ్ల కోసమే పథకాలు
- డి. వినోద్ కుమార్, జెఎన్టియుహెచ్ విద్యార్థి
బిజెపి ప్రభుత్వం పూర్తిగా ధనవంతులు, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని పథకాలు రూపొందిస్తోంది. స్వచ్ఛభారత్, డిజిటల్ ఇండియా తదితర పథకాలు కేవలం పట్టణాలకే పరిమితం చేసింది. వీటిలోనూ అవినీతి జరుగుతోంది. కార్మికులకు ఉపయోగపడే చట్టాల్లో కీలకమైన మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికైనా సామాన్యులను దృష్టిలో పెట్టుకొని పాలన సాగించాలి.
మోడీ మద్దతు ఇస్తున్నారు
మహమ్మద్ తాహ, జెఎన్టియుహెచ్ విద్యార్థి
కాంగ్రెస్ మాదిరిగానే బిజిపి పాలన కొనసాగు తోంది. దేశవ్యాప్తంగా వ్యాపం కుంభ కోణంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా ప్రధాన మంత్రి మోడీ పట్టించుకోలేదు. దీన్ని బట్టి ఆయన వారందరికీ మద్దతు ఇస్తున్నట్లు స్పష్టమవు తోంది. బిజెపి అధికారంలోకి వచ్చాక మత ఘర్షణలూ జరగడం బాధాకరం.
అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలి
- గిరిధర్, జెఎన్టియుహెచ్ విద్యార్థి
అవినీతిని నిర్మూలిస్తామని అధికారంలోకి వచ్చిన బిజెపి కూడా దాన్నే సమర్థిస్తోంది. చాలా మంది మంత్రులు అవినీతిలో కురుకుపోయారు. వారిపై బిజెపి అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అవినీతి మంత్రులను తొలగించి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
ఒకటే విధానం
- శుబోద్దికుమార్, పిహెచ్డి హెచ్సియు
గత యుపిఎ లాగే ఎన్డిఎ ప్రభుత్వం పనిచే స్తోంది. ఈ రెండింటికీ పెద్దగా తేడాలేదు. రెండు జాతీయ పార్టీలు అవినీతి లో ఒకటే విధానం. కొత్తదనమేమీ లేదు. ఏడాదిలోనే బిజెపి తీరు బట్టబయలైంది.
సంపన్న వర్గాల పార్లమెంట్
- డెబోలినా, పిహెచ్డి హెచ్సియు
ప్రభుత్వాలు సంపన్నవర్గాల కోసమే నడుస్తున్నాయి. పేదలకు అనుకూలంగా ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడకపోవడం దేశ దౌర్భాగ్యం. ఎవరిని కదిలించినా కోట్లాది రూపాయల అవినీతి బయట పడుతోంది. ఈ తీరు మారాలి.
సేవ పేరుతో దోపిడీ
- పారి, ఎంఫిల్ విద్యార్థి హెచ్యుసి
ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి, దానికి వంద రెట్లు కూడబెట్టు కోవడమే ధ్యేయంగా రాజకీయ నాయకులు దోపిడీ చేస్తున్నారు. దీనికి సేవ అనే ముసుగును ఉపయోగిస్తున్నారు. అన్ని రాష్ట్రా ల్లోనూ భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. వారిని సంఘ బహిష్కరణ చేసి, ఆస్తుల జప్తు చేయాలి.
కులమతాలు లేని సమాజం రావాలి
- ఆర్పిత, హెచ్యుసి విద్యార్థిని లింగ్విస్టిక్స్
ప్రజలచేత ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజాధనాన్నే కొల్ల గొడుతున్నారు. విభజించు - పాలించు నినాదంతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందు తున్నారు. కుల మతాలులేని సమాజం రావాలి. అవినీతి చీడను నశింపజేయాలి.
లోక్పాల్ అంటే భయం
- అరుణ్, హెచ్సియు విద్యార్థి
అవినీతి విషపుకోరలు పీకేందుకు లోక్పాల్ బిల్లును ముందుకు తేవాలి. అవినీతి డబ్బు ప్రజలకు పంచుతామన్న పెద్ద నాయకుల అనుచరులు అవినీతి ఊబిలో కూరుకు పోయారు. లోక్పాల్ వస్తే అవినీతి అంతమవుతుంది. దీనికి బిజిపి పూనుకోవాలి.
కాంగ్రెస్ బాటలోనే బిజెపి
- రాహుల్రెడ్డి, విద్యార్థి
బిజెపి ఏదో చేస్తుందని ప్రజలు భావించే, కాంగ్రెస్ను ఓడించి అధికారంలోకి తీసుకువచ్చారు. కానీ ఆ పార్టీ అదే బాటలో నడుస్తోంది. మాటలే కాని చేతలు లేవు. ముందు అట్టహాసంగా ప్రచారం చేయడం, తర్వాత వాటిని గాలికి వదిలేయడం పరిపాటిగా మారింది. స్వచ్ఛ భారత్, జన్ధన్ యోజన కూడా ఇదే కోవలోకి వస్తాయి. అవినీతి ఆరోపణలు కూడా ఏడాదిలోనే బయటకు వస్తున్నాయి.
పథకాల పేరుతో దుర్వినియోగం
- అలింబి, విద్యార్థిని
మహిళలకు రక్షణ కల్పించడంలో బిజెపి ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్ పాలనలో కన్నా ప్రస్తుతం మహిళలపై హింస పెరిగింది. చెప్పటం కాకుండా అభివృద్ధి చేసి చూపాలి. కేంద్రప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతోంది. కానీ, వాటిని సక్రమంగా అమలు చేయలేకపోతోంది.
పారదర్శకత ప్రదర్శించాలి
- ప్రవల్లిక, విద్యార్థిని
కాంగ్రెస్తో పోలిస్తే బిజెపి కొంచెం బెటర్గా కనిపించిన ప్పటికీ ప్రజలకు ఉపయోగం లేదు. ఒక్క ఏడాదిలోనే ఏదీ నిర్ణ యించలేం. ఎన్నికలకు ముందు చెప్పింది మాత్రం చేయలేకపోతోంది. అవినీతి ఆరోపణలపై పారదర్శకత చూపాలి.