Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాలు పెంచాలని డిమాండ్
నవతెలంగాణ-మధిర
మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులు తమను రెగ్యులరైజ్ చేసి వేతనాలు పెంచాలని కోరుతూ శనివారం విధులు బహిష్కరించారు. ఖమ్మం జిల్లాలోని బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాలకు చెందిన 60 మంది కార్మికులు నీటి విడుదలను నిలిపివేసి నిరసన తెలిపారు. 11 నెలలుగా విధులు నిర్వహిస్తున్నామన్నారు.రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్య పరిష్కరించే వరకు సమ్మె చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్మెన్ లింగాల కమల్రాజు వారితో మాట్లాడారు. సమస్యను త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, సమ్మె పేరుతో నీటి నిలుపుదల చేస్తే ప్రజలు ఇబ్బం దులకు గురవుతారని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి విధుల్లో చేరాలని కోరగా కార్మికులు సానుకూలంగా స్పందించి నిరసన విరమించారు.