Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిజాంపేట
అప్పుల బాధతో రైతు పురుగుల మందుతాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఎస్ఐ ఆంజనేయులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన గేల్లు గోపాల్(38) తన రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసేవాడు. నీటి కోసం పొలంలో మూడు బోర్లు వేయించాడు. కానీ నీరు పడలేదు. బోర్లు, వ్యవసాయానికి రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పు తీర్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఈనెల 13న పొలంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకుపోయారు. అప్పటి నుంచి చికిత్స పొందినా ఆరోగ్యం కుదుట పడలేదు. పరిస్థితి విషమించి శనివారం మృతిచెందాడు. రైతుకు కొడుకు, కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. బాధిత కుటుంబాన్ని జెడ్పీటీసీ విజరుకుమార్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రవిపల్లి అమరసేనారెడ్డి పరామర్శించారు.