Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫౌల్ట్రీ ఫెడరేషన్ అక్రమాలపై విచారణకు డిమాండ్
నవతెలంగాణ-నారాయణగూడ
తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్లో రూ.100 కోట్లకుపైగా జరిగిన మక్కల కుంభకోణంపై న్యాయస్థానం, సీబీఐ జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని ఫౌల్ట్రీ రైతులు బాలకష్ణారెడ్డి, అభిషేక్రెడ్డి, వెంకట్రెడ్డి, శరత్బాబు, అజరు, లలిత్బాబు, మహేందర్రెడ్డిలు డిమాండ్ చేశారు. శనివారం హైదర్గూడలోని ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యాలయాల ఎదుట రోడ్డుపై పౌల్ట్రీ రైతులు అర్ధనగ ప్రదర్శన చేశారు. పౌల్ట్రీ రైతులు మాట్లాడుతూ.. ఫెడరేషన్లో అక్రమాలకు పాల్పడ్డ ఫెడరేషన్ చైర్మెన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు, ప్రధాన కార్యదర్శి మోహన్రెడ్డిలను విచారించాలన్నారు. బిల్డింగ్ ఫండ్ పేరుతో రైతుల వద్ద నుంచి వసూలు చేసిన రూ.4.50 కోట్ల నిధులు నొక్కేశారన్నారు. సబ్సిడీ మక్కలను చిన్న, సన్నకారు రైతులకు అందించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.