Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్
నవతెలంగాణ-రాంనగర్
భారత జాతీయోద్యమం 1919లో మొదలైందనీ, ఆ ఉద్యమం కంటే ముందే సంఘ సంస్కరణోద్యమం వచ్చిం దని ఆంధ్రజ్యోతి సంపా దకులు కె.శ్రీనివాస్ అన్నారు. ప్రముఖ రచయిత సింగారెడ్డి ఇన్నారెడ్డి రచించిన 'ఆంధ్రప్రదేశ్లో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు (1920-1947)' పుస్తకాన్ని ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజాశక్తి బుకహేౌస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. పత్రికల్లో చరిత్రకు సంబంధించిన అనేక వ్యాసాలు వస్తున్నాయని చెప్పారు. సామాజిక అంశాలకు సంబంధించిన ఇలాంటి పుస్తకం నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. సభాధ్యక్షత వహించిన పూల ఆంథోని మాట్లాడుతూ మనిషిగా జీవించినందుకు ఏదో ఒకటి సాధించా లనే తపనతో ఈ పుస్తకాన్ని రాశారన్నారు. కార్యక్రమంలో ఆచార్య వకుళాభరణం రామకష్ణ, ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రతినిధి లక్ష్మయ్య పాల్గొన్నారు.