Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : యూపీఏ హయాంలో 111 ఎయిరిండియా విమానాల కొనుగోలులో మనీలాండరింగ్కు సంబంధించిన కేసులో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 23న ఈడీ కార్యాలయంలో దర్యాప్తు అధికారులు ముందు హాజరై చిదంబరం తన వాంగ్మూలాన్ని ఇవ్వాలని ఆదేశించింది. ఎయిరిండియా సంస్థ కోట్ల రూపాయలు నష్టపోయినట్టు ఆరోపణలున్న భారీ కుంభకోణం, అంతర్జాతీయ విమానాలకు స్లాట్లు కేటాయించడంలో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించిన ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే కేంద్ర మాజీ విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా, చిదంబరాన్ని ప్రశ్నించేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. చిదంబరం ఇప్పటికే ఎయిర్సెల్ మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.