Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరాలు ఇవ్వాలని పిపిఏకు ఆదేశం
అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండర్లు పిలవడంపై కేంద్ర జలసంఘం ఆరా తీస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పాత టెండర్లను రద్దుచేసి రివర్స్ టెండర్లు పిలిచేందుకు విధివిధా నాలు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర జల సంఘం స్పందించింది. రివర్స్ టెండర్లపై పూర్తి వివరాలు సమర్పించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించింది. కేంద్ర పరిధిలో ఉన్న ప్రాజె క్టుకు సంబంధిం చిన టెండర్లపై కేంద్ర జలసంఘా నికి కనీస సమాచారం లేకుండా టెండర్లు రద్దు చేయ డంపై వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. రివర్స్ టెండర్లకు వెళ్లడం సరికాదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచించింది. ఒకవేళ నిర్ణయం మార్చాల నుకుంటే పిపిఏతో సంప్రదింపులు జరిపి చేయాల్సి ఉంది. రివర్స్టెండర్లపై పరిశీలన చేయాలని పిపిఏ తెలిపినా దాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం విధివిధా నాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో అసలు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నీ సమర్పించాల ని కేంద్ర జలసంఘం నివేదిక కోరింది. ఇప్పటివరకూ ప్రాజెక్టు పని ఎంతయింది? ఇంకా ఎంత చేయాల్సి ఉంది? అనే వివరాలనూ అడిగింది. అలాగే ప్రాజెక్టు కు అయిన ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపైనా కేంద్రం పిపిఏను పూర్తిస్థాయి నివేదిక కోరింది. రివర్స్ టెండర్లపై కేంద్రం గుర్రుగా ఉండటంతో ప్రాజెక్టు పరిస్థితి ఏమిటనే అంశం చర్చనీ యాంశం అయింది.
హైకోర్టుకు నవయుగ
పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కాంట్రాక్టును ఏపీ సర్కార్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. గతంలోని ఒప్పందం మేరకు పనులు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ఆ కంపెనీ డైరెక్టర్ వై.రమేష్ రిట్ వేశారు. 'మరో వ్యక్తికి ఈ కాంట్రాక్టు ఇవ్వకుండా ఉత్తర్వులు ఇవ్వాలి. కాంట్రాక్టు రద్దు అయితే కంపెనీకి ఆర్థికంగా ఎంతో నష్టం వస్తుంది.
పైగా ప్రతిష్టకు భంగం కూడా కలుగుతుంది. పోలవరం అథారిటీ కాదన్నా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు నిర్ణయం తీసుకుంది. జీవో కూడా ఇచ్చిందని రిట్లో తెలిపారు.