Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హకీంపేట రాజీవ్ రహదారిపై రాస్తారోకో
- కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
నవతెలంగాణ- సిటీబ్యూరో
ఆరు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని సింగాయిపల్లి గ్రామస్తులు హకీంపేట రాజీవ్రహదారిపై ఖాళీ బిందెలతో సోమవారం నిరసన తెలిపారు. దీంతో సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ జైపాల్రెడ్డి మాట్లాడుతూ.. సమస్యను మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. సమస్యను పరిష్కరించకపోతే కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు.