Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలికల హాస్టల్లో పేలిన సిలిండర్
- మరోచోట పైకప్పు కూలి విద్యార్థినికి గాయాలు
- భవనంపై నుంచి దూకిన విద్యార్థి
పాఠశాలల్లో పలు చోట్ల సోమవారం ప్రమాదాలు జరిగాయి. జగిత్యాలలోని బాలికల హాస్టల్లో సిలిండర్ పేలి పైకప్పు ధ్వంసమైంది. మరో చోట రెండేండ్ల కిందట కట్టిన తరగతి గది పైకప్పు కూలి విద్యార్థినికి తీవ్రగాయమైంది. సూర్యాపేటలో ఇక్కడ చదవడం ఇష్టం లేదని ఓ విద్యార్థి భవనంపై నుంచి దూకాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలం గాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల వంటగదిలో సోమవారం సాయంత్రం సిలిండర్ పేలింది. గది పైకప్పు ధ్వంసమైంది. 300మంది బాలికలున్న ఈ వసతిగృహంలో సోమ వారం సాయంత్రం స్నాక్స్ తయారు చేసేందుకు వంట మనిషి గదిలోకి వెళ్లింది. స్టవ్ వెలిగించగానే మంటలు అంటుకున్నాయి. దీంతో వంటమనిషి బయటకు పరుగులు తీసింది. నిమిషం వ్యవధిలోనే సిలిండర్ పేలింది. ఈ ధాటికి పైకప్పు ధ్వంసమైంది. సమీపంలో విద్యార్థులెవరూ లేకపోవడం, వంటమనిషి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. ఫైర్సిబ్బంది మంటలను ఆర్పింది.
కూలిన పాఠశాల భవనం పైకప్పు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణకేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని ఆరోతరగతి గది పైకప్పు కూలింది. ఉపాధ్యాయురాలు పాఠం బోధిస్తున్న సమయంలో పైకప్పు పెచ్చులూడి పట్టాయి. దీంతో విద్యార్థిని హర్ష తలకు తీవ్రగాయమైంది. మరో ఐదుగు రికి స్వల్పగాయాలయ్యాయి. విద్యార్థులను వెంటనే ప్రభు త్వాస్పత్రికి తరలించారు. గదిలో మొత్తం 30 మంది విద్యార్థులున్నారు. ఈ భవనాన్ని రెండేండ్ల కిందటనే నిర్మించారు. కాంట్రాక్టర్ నాణ్యతాలోపంతో నిర్మించడం తోనే ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తు న్నారు. వెంటనే సదరు కాంట్రాక్టర్పై, సహకరించిన అధికారులపై తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని మైనార్టీ గురుకులంలో పాఠశాల భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. మట్టంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్ సమీర్ తుంగతుర్తి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. బక్రీద్ పండుగ సెలవులకు ఇంటికి వెళ్లాడు. సోమవారం సమీర్ తండ్రి సైదావలితో కలిసి పాఠశాలకు చేరుకున్నారు. అయితే, ఈ పాఠశాలలో చదవడం తనకు ససేమిరా ఇష్టం లేదంటూ తండ్రితో వాదించాడు. ఈ సమయంలోనే వెళ్లి పాఠశాల మొదటి అంతస్తుపైకి ఎక్కి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం సూర్యాపేటకు తరలించారు విషయం తెలుసుకున్న తుంగతుర్తి సీఐ శ్రీరాముల అయోధ్య, ఎస్ఐ శ్రీకాంత్ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు.
బయటకు పరుగులు తీసింది. నిమిషం వ్యవధిలోనే సిలిండర్ పేలింది. ఈ ధాటికి పైకప్పు ధ్వంసమైంది. సమీపంలో విద్యార్థులెవరూ లేకపోవడం, వంటమనిషి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. ఫైర్సిబ్బంది మంటలను ఆర్పింది.
కూలిన పాఠశాల భవనం పైకప్పు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణకేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని ఆరోతరగతి గది పైకప్పు కూలింది. ఉపాధ్యాయురాలు పాఠం బోధిస్తున్న సమయంలో పైకప్పు పెచ్చులూడి పట్టాయి. దీంతో విద్యార్థిని హర్ష తలకు తీవ్రగాయమైంది. మరో ఐదుగు రికి స్వల్పగాయాలయ్యాయి. విద్యార్థులను వెంటనే ప్రభు త్వాస్పత్రికి తరలించారు. గదిలో మొత్తం 30 మంది విద్యార్థులున్నారు. ఈ భవనాన్ని రెండేండ్ల కిందటనే నిర్మించారు. కాంట్రాక్టర్ నాణ్యతాలోపంతో నిర్మించడం తోనే ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తు న్నారు. వెంటనే సదరు కాంట్రాక్టర్పై, సహకరించిన అధికారులపై తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని మైనార్టీ గురుకులంలో పాఠశాల భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. మట్టంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్ సమీర్ తుంగతుర్తి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. బక్రీద్ పండుగ సెలవులకు ఇంటికి వెళ్లాడు. సోమవారం సమీర్ తండ్రి సైదావలితో కలిసి పాఠశాలకు చేరుకున్నారు. అయితే, ఈ పాఠశాలలో చదవడం తనకు ససేమిరా ఇష్టం లేదంటూ తండ్రితో వాదించాడు. ఈ సమయంలోనే వెళ్లి పాఠశాల మొదటి అంతస్తుపైకి ఎక్కి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం సూర్యాపేటకు తరలించారు విషయం తెలుసుకున్న తుంగతుర్తి సీఐ శ్రీరాముల అయోధ్య, ఎస్ఐ శ్రీకాంత్ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు.