Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూర్
మిషన్ భగీరథ కాంట్రాక్టర్ నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటూ ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సుర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మిషన్ భగీరథ కాంట్రాక్టర్ గురువయ్యకు బిల్లులు చెల్లించేందుకు ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్ డబ్బులు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇస్తేనే రూ.22 లక్షల బిల్లులు చెల్లిస్తామని చెప్పడంతో గురువయ్య ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు కాంట్రాక్టర్ గురవయ్య డబ్బులు ఇవ్వడానికి శ్రీనివాస్ దగ్గరికి రాగా, వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్కు ఇవ్వాలని సూచించాడు. మహేందర్కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం డీఈ శ్రీనివాస్ ఇంటిపైనా దాడులు నిర్వహించారు.