Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రయివేటు విశ్వవిద్యాలయాల్లో స్థానికులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు టీపీఏ అధ్యక్షులు నాగటి నారాయణ, ప్రధాన కార్యదర్శి పగడాల లక్ష్మయ్య మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సామాజిక రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ప్రయివేటు విశ్వవిద్యాలయాల్లో ఫీజులను ప్రభుత్వం నియంత్రించాలని సూచించారు. జీవో నెంబర్ 26ను సవరించాలని కోరారు.