Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎప్పుడో పాలన గాడి తప్పిందని, సీఎం ఇప్పు డు కలెక్టర్ల సదస్సులో స్వయంగా ఒప్పుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. మంగళవారం సీఎల్పీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ తన పాలన అవినీతిమయమైందని గుర్తించారన్నారు. అవినీతికి ద్వారా లు తెరవడం మినహా కేసీఆర్ సాధించిందేమిటని ప్రశ్నిం చారు. అవినీతిని తగ్గించేందుకు కొత్త రెవెన్యూ పాలసీ అంటున్నారంటే... ఇప్పటివరకు అవినీతి జరిగిందని ఒప్పు కున్నట్టే కదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం, భగీరథపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.