Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి విద్యాశాఖ కార్యదర్శి బి జనార్ధన్రెడ్డి వంద సూచ నలు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జనార్ధన్రెడ్డిని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి విజరుకుమార్బుధవారం హైదరాబాద్లో సన్మానిం చారు. ఈఏడాది ఫిబ్రవరి 27న విద్యాశాఖ కార్యద ర్శిగా జనార్ధన్రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాఠశాల విద్యారంగం అభివృద్ధికి వాట్సాప్ ద్వారా వంద సూచనలు, సలహాలు ఇచ్చారు. నాణ్యమైన విద్య అందించడం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పెంచడం, మౌలిక వసతులు కల్పించడం, ఎన్రోల్మెంట్ పెంచడం వంటి అంశాలను రోజూ పర్యవేక్షించారు.
వంద సూచనల అమలు తీరుపై బుధవారం సమీక్షా సమావేశం జరిగింది. వందశా తం హాజరు ఉన్న విద్యార్థులను ముఖ్యంగా బాలికల ను ప్రోత్సహించాలని, సైకిళ్లు అందజేయాలని జనార్ధన్రెడ్డి సూచించారు.