Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ కార్యదర్శికి పీఆర్టీయూ తెలంగాణ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల ఆఫీసు బేరర్లను ఎంఈవో/సెక్టోరల్ అధికారులుగా కొనసాగించొద్దని పీఆర్టీయూ తెలంగాణ తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బి జనార్ధన్రెడ్డిని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం చెన్నయ్య బుధవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయా మండలంలోని సీనియర్ హెడ్మాస్టర్కు ఎంఈవోగా బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఎంఈవో/సెక్టోరల్ అధికారులుగా ఉన్న సంఘాల నాయకులు ఆ పదవులను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఆయా సంఘాల సభ్యత్వం చేసేందుకు అధికారాలను వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కొందరు ఉపాధ్యాయులకు ఇష్టం లేకపోయినా సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు. పాఠశాలల తనిఖీలకు వెళ్లినపుడు సొంత సంఘం ఉపాధ్యాయులు గైర్హాజరైతే చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇతర సంఘాల ఉపాధ్యాయులుంటే చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇది సరైంది కాదని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలకు సంబంధం లేని వారిని ఎంఈవో/సెక్టోరల్ అధికారులుగా నియమించాలని సూచించారు.