Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడోరోజు రిలే దీక్షలో వ్యకాస రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్
నవతెలంగాణ-మంచాల
విముక్తి రైతులందరికీ కొత్తపాస్పుస్తకాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.ప్రసాద్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలేనిరాహార దీక్ష బుధవారంతో మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విముక్తి రైతులకు పంట రుణాలు, రైతుబంధు, రైతుబీమా మొదలగు పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూర్ మండలాల్లో వందలాది విముక్తి రైతులున్నారనీ, వాళ్లంతా కొన్నేండ్లుగా పంటపొలాలను సాగుచేసుకుంటున్నారనీ తెలిపారు. వెట్టిచాకిరీ నుంచి విముక్తి పొందిన కుటుంబాలకు 1994లో గవర్నర్ పేరు మీద భూమి ఇచ్చారనీ, వాటిని రైతుల పేర్ల మీద మార్చి పాస్పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీక్షలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కె.శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఏర్పుల స్వామి, మండల నాయకులు అవుల యాదయ్య, నోముల జంగయ్య, నోముల సంజీవ, పుల్లగాళ్ల గోపాల్ పాల్గొన్నారు.