Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26, 27 ఉద్యోగుల సమ్మె.. 28, 29 వారాంతపు సెలవులు
న్యూఢిల్లీ : ఈ నెల ఆఖరులో వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకుల కార్యాలయాలు మూత పడనున్నాయి. పది ప్రభుత్వ బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 26, 27 తేదీల్లో సమ్మె చేపట్టాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఎఐబీఓసీ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఎఐబీఓసీ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్బీఓసీి), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్ఓబీఓ) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెకు సీఐటీయూ తదితర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో, 26, 27 తేదీల్లో బ్యాంకుల కార్యకలాపాలు పూర్తిగా స్థంభించ నున్నాయి. 28న నాలుగో శనివారం, ఆదివారం వారాంతపు సెలవు కాబట్టి బ్యాంకులు తెరుచుకోవు.