Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి
- సాగర్ కాల్వలో కారు మునిగి అత్తాకోడళ్లు..
- కోడలు గర్భిణి కావడంతో కడుపులోనే బిడ్డ మృతి
నవతెలంగాణ-పిట్లం/ఆర్మూర్ టౌన్
వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆదివారం ఎనిమిది మంది మృతిచెందారు. ఖమ్మంరూరల్ మండలం గొల్లగూడెం వద్ద సాగర్ కాల్వలోకి కారు దూసుకెళ్లడంతో నీటమునిగి అత్తాకోడళ్లు మృతిచెందారు. కోడలు తొమ్మిది నెలల గర్భిణి కావడంతో కడుపులోకి నీరుచేరి శిశువు కూడా మరణించింది. కామారెడ్డి జిల్లాలో టైరు పంక్చర్ చేస్తుండగా ఖాళీ బీరుసీసాల లారీ ఢకొీట్టడంతో ఇద్దరు లారీ డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ జిల్లా చినగూడూరు మండలం, జియ్యారం గ్రామానికి చెందిన పోగుల మహిపాల్, స్వాతి(28) దంపతులు. ఆమె తొమ్మిది నెలల గర్భిణి కావడంతో అత్త ఇందిర(45)తో కలిసి కారులో వైద్య పరీక్షల కోసం ఖమ్మంకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో గొల్లగూడెం వద్దకు రాగానే బహిర్భూమి నిమిత్తం సాగర్ కాల్వ కట్టపై కారు ఆపారు. అనంతరం రివర్స్ చేస్తున్న క్రమంలో అదుపుతప్పి కాల్వలో పడిపోయింది. మహిపాల్ కారు అద్దాలు పగులగొట్టుకుని బయటికి రాగా భార్య, తల్లి ఊపిరాడక అందులోనే మృతిచెందారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న రూరల్ పోలీసులు క్రేన్ సాయంతో కారును బయటికి తీయగా వారిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో స్వాతికి ఆపరేషన్ చేయగా మగ బిడ్డ మృతిచెంది ఉన్నాడు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్నకొడప్గల్ 161వ జాతీయ రహదారిపై నాందేడ్కు బియ్యం లోడ్తో వెళ్తున్న లారీకి పంక్చర్ అయ్యింది. మరమ్మతులు చేస్తుంగా హైదరాబాద్ నుంచి ఖాళీ బీరుసీసాల లోడ్తో వస్తున్న లారీ వారిని బలంగా ఢకొీట్టడంతో షేక్రిజ్వానా (40), వుద్దవ్ గోపాల్రావ్ (39) అక్కడికక్కడే మరణించారు. కంటైనర్లో ఉన్నవారిని బాన్సువాడ ఏరియాస్పత్రికి తరలించినట్టు ఎస్సై సుధాకర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మానస పాఠశాల వద్ద గుర్తుతెలియని వాహనం ఢకొీని ఒకరు మృతిచెందినట్టు ఎస్ఐ విజయనారాయణ తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం బాలాజీనగర్కు చెందిన విజరు, ఖేమ్ దంపతులు కుమారుడు దేవరాజు(5)ను తీసుకొని కూరగాయలు, ఇంటి సామాగ్రి కొనుగోలు చేసేందుకు రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. హుజూర్నగర్ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు దేవరాజును ఢకొీట్టడంతో మరణించాడు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం కొజ్జావనంపల్లి వద్ద బైకు అదుపు తప్పి కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లికి చెందిన వెంకటయ్య(45) ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన రామిడి పావని (28), ఆమె కొడుకు లికిత్, తల్లి వసంత కలిసి స్కూటీపై వెళ్తుండగా పాల వ్యాను ఢకొీట్టింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి పావని మరణించింది.