Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెచ్చులూడి పడి మహిళ మృతి
- నాణ్యతపై అనుమానాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో/అమీర్పేట
వర్షం వస్తుంటే..పక్కనే ఉన్న మెట్రోస్టేషన్ కింద నిలబడ్డ మహిళపై పెచ్చులూడిపడ్డాయి. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలై ఆమె మృతిచెందింది. ఈ ఘటన అమీర్పేట మెట్రోస్టేషన్ ఆవరణలో ఆదివారం జరిగింది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ వివరాల ప్రకారం... కేపీహెచ్బీకి చెందిన కంతాల మౌనిక (24) ఆమె సోదరితో కలిసి కేపీహెచ్బీ నుంచి అమీర్పేట వరకు మెట్రోలో వచ్చారు.
స్టేషన్ నుంచి సారథి స్టూడియోవైపు వెళ్తుండగా వర్షం రావడంతో మెట్రోస్టేషన్ కింద నిలబడ్డారు. స్టేషన్ నిర్మాణంలోని సిమెంట్ పెచ్చులూడి ఆమె మీద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెట్రో సిబ్బంది దగ్గరలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి బాధితురాలు మరణించింది. ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మెట్రో పనులు నాణ్యంగా జరుగుతున్నాయని ప్రభుత్వం అంటుంటే..మరోవైపు పెచ్చులూడిపడుతున్న ఘటనల్లో మెట్రో నాణ్యత,భద్రత అంశాలపై పలువురిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.