Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలాం జయంతి వేడుకలో రమేష్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాస్త్ర సాంకేతిక ఫలాలు అట్టడుగువర్గాలకు అందాలని సామాజిక కార్యకర్త టి రమేష్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం జయంతి వేడుకలు జరిగాయి. కలాం చిత్రపటానికి రమేష్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలాం విజయం వచ్చే వరకు నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో ఉంచారని చెప్పారు. పట్టుదలతో చదివి పేపర్బారు నుంచి మిస్సైల్మ్యాన్గా ఎదిగారని అన్నారు. రాష్ట్రపతిగా ఉన్నత పదవి వచ్చినా నిరాడంబరంగా జీవితం గడిపారని వివరించారు. పీఎస్ఎల్వీ రాకెట్ రూపకర్తగా కలాం విశేష కృషి చేశారని అన్నారు. నిరంతరం ప్రజల కోసం ఆలోచించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి చీఫ్ గార్డెనర్ వై సత్యనారాయణ, ప్రిన్సిపాల్ కె సురేందర్రెడ్డి, కోఆర్డినేటర్ జనార్ధన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.