Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాడ్వాయిలో రైతుల రాస్తారోకో
నవతెలంగాణ- తాడ్వాయి
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒకే విడతలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో సోమవారం రైతులు రాస్తా రోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం సందర్భంగా రూ.లక్ష వరకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. రుణమాఫీ చేయకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.a