Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాక్టో రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరామ్
- కేసీఆర్పై కేసు నమోదు చేయాలి: రాజిరెడ్డి
నవతెలంగాణ- రాంనగర్
ఆర్టీసీ కార్మికుల సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారాల్సిన అవసరముందని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉపాధ్యాయ ఐక్యకార్యాచరణ సమితి (జాక్టో) ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మెను కాపాడుకుంటేనే భవిష్యత్తులో కార్మిక పంథా విజయం సాధిస్తుందని చెప్పారు. ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్, సీసీఎస్ డబ్బులను వాడుకున్నందుకు సీఎం కేసీఆర్పై కేసు నమోదు చేయాలన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కష్ణయ్య మాట్లాడుతూ.. ఉధృతంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కేసీఆర్ అనేక కుట్రలు పన్నుతున్నారని, ఆ కుట్రలను తిప్పికొట్టి ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకం కావాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. సీఎం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూన్నారని విమర్శించారు. ఈ నెల 18న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకుని సకల జనుల భేరీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు సుధాకర్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకులు గోవర్ధన్ పాల్గొన్నారు.