Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులతో టీ-టఫ్ చర్చలు విఫలం
- నేడు ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఈనెల 23 తర్వాత ఎప్పు డైనా మెరుపుసమ్మెలోకి వెళ్తా మని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ (టీ-టఫ్) ప్రకటించింది. విద్యుత్సౌధలో మంగళ వారం ట్రాన్స్కో జేఎమ్డీ శ్రీనివాసరావు, ఇతర డైరెక్టర్ల తో టీ-టఫ్ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీనితో ముందుగా ప్రకటిం చిన ప్రకారం బుధవారం ఉదయం మింట్కాంపౌండ్లోని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నట్టు టీ-టఫ్ ప్రతినిధులు తెలిపారు. రెండో విడతగా జరిగిన ఈ చర్చల్లో ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపచేయాలనే డిమాండ్ను విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు అంగీకరించలేదు. న్యాయపరమైన
సమస్యలు వస్తాయనే కారణాన్ని చూపుతూ స్టాండింగ్ ఆర్డర్స్నే వర్తింప చేస్తామని తెలిపారు. త్వరలో మూలవేతనం ఏర్పాటు చేస్తామని, డీఏ స్థానంలో వీడీఏ పాయింట్లు, చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం సహా అన్ని డిమాండ్లపై 'ఆలోచిస్తాం' అనే అధికారులు సమాధానం చెప్పారని టీ-టఫ్ చైర్మెన్ ఎన్ పద్మారెడ్డి, కన్వీనర్ ఈ శ్రీధర్ తెలిపారు. తొలివిడతలో జరిగిన చర్చలకు, మంగళవారం జరిగిన చర్చలకు ఎలాంటి వ్యత్యాసం లేదని, అధికారులు అప్పుడు ఏమి చెప్పారో...ఇప్పుడూ అవే కారణాలు, సాకులు చెప్పారని అన్నారు. సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించకపోవడం వల్లే తాము ఆందోళనకు వెళ్లాల్సి వస్తున్నదని వివరించారు. టీఎస్ఎస్పీడీసీఎల్ వద్ద జరిగే ధర్నాలో జెన్కో ఉద్యోగ, ఆర్టిజన్ కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. అధికారులతో జరిగిన చర్చల్లో టీ-టఫ్ కో కన్వీనర్లు ఎస్ శ్రీధర్గౌడ్, కె కుమారచారి, జి సాయిబాబు, మాజీద్, గంబో నాగరాజు, రాధాకృష్ణ, సాయిలు తదితరులు పాల్గొన్నారు.