Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యామంత్రికి టీఎస్పీటీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్పీటీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని టీఎస్పీటీఏ అధ్యక్షులు సయ్యద్ షౌకత్అలీ, ప్రధాన కార్యదర్శి నాగమోని చెన్నరాములు బుధవారం కలిసి వినతిపత్రం సమర్పించారు.
సార్వత్రిక మౌలిక అభ్యసనంపై ఒప్పందం
సార్వత్రిక మౌలిక అభ్యసనం ప్రాజెక్టుపై సెంటర్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ (సీఐటీఐఎస్)తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం విద్యాశాఖ కార్యదర్శి బి జనార్ధన్రెడ్డి, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ప్రతినిధులు రాహుల్ అహ్లూవాలియా, ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి విజరుకుమార్ల సమక్షంలో ఒప్పందం జరిగింది. 2023 నాటికి పాఠశాల స్థాయిలో సార్వత్రిక మౌలిక అభ్యసనం జరిగేలా చూస్తామని విజరుకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యావిధానాన్ని మెరుగుపర్చడానికి ప్రస్తుత మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, నియమ నిబంధనల గురించి ప్రాథమిక నిర్ధారణ శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. లక్ష్య సాధన దిశగా జిల్లా విద్యా నాణ్యతా సూచికలు రూపొందిస్తామని తెలిపారు.
మాకు న్యాయం చేయండి
తమకు న్యాయం చేయాలని డీఎస్సీ-98 అభ్య ర్థులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బి జనార్ధన్రెడ్డిని బుధవారం అభ్యర్థి శ్రీని వాస్ కలిసి వినతిపత్రం సమర్పించారు. నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో డీఎ స్సీ-1998లో క్వాలిఫై అయ్యామని తెలిపారు. తమ కు ఉద్యోగాలివ్వాలని హైకోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు.