Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయూఎంహెచ్ఈయూ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వైద్య, ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు ఎంపీహెచ్ఏ(ఎం) ఉద్యోగులను యధావిధిగా కొనసాగించాలని తెలంగాణ యూనైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (టీయూఎంహెచ్ఈయూ) డిమాండ్ చేసింది. రాష్ట్రంలో మల్టీపర్సన్ హెల్త్ అసిస్టెంట్ల పని సరిగా లేదనే సాకుతో ప్రభుత్వం, వారిని ఇతర స్కీమ్ల్లోకి మార్చబోతున్నట్టు సమచారం వస్తున్నదని పేర్కొంది. ఈ వైఖరి తీవ్రంగా ఖండించింది. ఈమేరకు శుక్రవారం యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదనాయక్, బలరామ్, ఉపాధ్యక్షులు భూపాల్, కోశాధికారి ఎండీ ఫసియొద్దీన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంపీహెచ్ఏ(ఎం) జాబ్ చార్జ్ ప్రకారం పనులు కల్పించడంలో వైద్య, ఆరోగ్య శాఖ విఫలమైందని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి వీరికి పనిలేదని చెబుతున్నారని తెలిపారు. ఇటువంటి చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు. సుమారు 1225 మంది గత 17 ఏండ్లుగా పని చేస్తున్నా వారికి ఇప్పు డు పనిలేదనడం ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తున్నదని పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు, మేల్ హెల్త్ అసిసెంట్స్, ఫిమేల్ హెల్త్ అసిసెంట్స్, పార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్, స్టాఫ్ నర్సులు, వైద్య విధాన పరిషత్, ఆయూ ష్, ఎన్హెచ్ఎం, కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులతోపాటు వైద్య, ఆరోగ్య శాఖలోని అర్హత కలిగిన వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని వారు కోరారు.