Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వం పంతాలకు పోకుండా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలనీ కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర సంఘం ( ఐద్వా), డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్వీకే నుంచి బర్కత్పుర బస్డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు ర్యాలీ ప్రారంభం కాగా అనుమతి లేదని పోలీసులు కొద్ది సేపు నిలిపేశారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని ఐద్వా నాయకులు ఆసహనం వ్యక్తం చేశారు. కొద్ది సేపటితర్వాత పోలీసులు ర్యాలీని అనుమతించారు. ఎస్వీకే నుంచి ప్రారంభమైన ర్యాలీ బాగ్లింగంపల్లి, మీదుగా బర్కత్పుర బస్ డిపో వరకు సాగింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలనీ, ఆత్మహత్యలకు పాల్పడ్డ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలనీ ఈ సందర్భంగా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. అనంతరం బర్కత్పుర బస్డిపో వద్ద జరిగిన సంఘీభావ సభలో ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి , జాతీయ నాయకురాలు హైమావతి, రాష్ట్ర అధ్యక్షు రాలు కెఎన్. ఆశాలత , రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. అరుణజ్యోతి, వినోద, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి. విజయమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాద్యక్షులు టి. రవి, నగర కార్యదర్శి జావిద్, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.