Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, కార్మికుల సమాఖ్య అఖిల భారత అధ్యక్షులు కుట్టి
నవతెలంగాణ -రాంనగర్
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించే ఆలోచనను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మికుల సమాఖ్య అఖిల భారత అధ్యక్షులు కె.కె.ఎన్.కుట్టి డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమాఖ్య అఖిలభారత కార్యదర్శివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. వేతన ఫిట్మెంట్ ఫార్ములా 3.7గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జనవరి 8న సమ్మె చేయనున్నట్టు ప్రకటించారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, కార్మికుల సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్మెస్ రాజా, ట్రెజరర్ వి.భట్టాచార్య ప్రసాద్(బెంగళూరు), పి.కె.రారు (పశ్చిమ బెంగాల్,) మోహన్తి(ఒడిషా), రాజేంద్రన్ (కేరళ), గణేషన్(తమిళనాడు), ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి ఆజీజ్ తదితరులు పాల్గొన్నారు.