Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురు నేతల అరెస్టు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలనీ, వారితో చర్చలు జరపాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. శనివారం రాష్ట్ర బంద్ను పురస్కరించుకుని పాత బస్తీలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్బాబు, మాజీ ఎంపీ అంజన్కుమార్, అనిల్యాదవ్ ధర్నాకు దిగారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ బంద్ను విజయ వంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రబంద్ను అణచివేయాలని ప్రయత్నం చేసిందని విమ ర్శించారు. న్యాయ స్థానాలను సైతం ముఖ్య మంత్రి కేసీఆర్ లెక్క చేయడం లేదన్నారు. వెంటనే ప్రభు త్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. బహూ దుర్పురా చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు విక్రమ్గౌడ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్ ధర్నా చేపట్టారు. పోలీసులకు, నాయకుల కు తోపు లాట జరిగింది. వెంకట్ను పోలీసులు కొట్టారు. బల వంతం గా వారిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలిం చారు.
న్యాయస్థానం చెప్పినా...బేఖాతర్ చేస్తారా?: గూడూరు
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ న్యాయస్థానం చెప్పినా...బేఖాతర్ చేస్తారా? అని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ పూర్తిగా విజయవంతమైందని చెప్పారు. శనివారం గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు.