Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాజీవ్గాంధీ ఆశయాలకు పునరంకితమవుదామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా చెప్పారు. భారత దేశాన్ని టెక్నాలజీ రంగంలో అభివద్ధి చేయడానికి ఆయన బలమైన పునాదులు వేశారని కొనియాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలకమైన మార్పులకు అంకురార్పణ చేశారని గుర్తుచ చేశారు. శనివారం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చార్మినార్ నుంచి గాంధీభవన్ వరకు సాగింది. అనంతరం సీనియర్ నేత నిరంజన్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఉస్మానియా ఆస్పత్రి రిటైర్డు సూపరింటెండెంట్ ఏ.గోపాలకష్ణకు సద్భావన అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు వి.హనుమంతరావు, భట్టి విక్రమార్క, ఎంపీ ఎంఏ ఖాన్, ఎమ్మెల్యే శ్రీధర్బాబు, కోదండరెడ్డి, విద్యార్ధి, యువజన, మహిళా విభాగాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.