Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోధన్ /చేవెళ్ల
డెంగ్యూ జ్వరంతో శనివారం ఇద్దరు మృతిచెందారు. వీరిలో రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన బాలుడు, నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన యువకుడు ఉన్నారు. బోధన్ పట్టణం శ్రీనివాస్నగర్ క్యాంపునకు చెందిన బాలకోటిరెడ్డి(27) రెండు రోజులు తీవ్ర జ్వరంతో బాధపడగా, కుటుంబీకులు స్థానికంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు రక్తకణాలు తగ్గినట్టు చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. డెంగ్యూగా నిర్ధారించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్లకు చెందిన కుమ్మరి మల్లేశ్- మంజుల కుమారుడు వంశీకృష్ణ(9)కు జ్వరం వచ్చింది. శుక్రవారం పరిస్థితి విషమించడంతో నగరంలోని రెయిన్బో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.