Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహదేవ్పూర్
విద్యుద్ఘాతానికి గురై జయశంకర్, భద్రాద్రి జిల్లాల్లో మంగళవారం ముగ్గురు మృతిచెందారు. జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ మండలం అంబ టిపల్లికి చెందిన నారం రాజయ్య(35) దీపావళి పండుగ కోసం ఇంటికి సున్నం వేయిస్తున్నాడు. వారింటి పక్కనుండే శివ(16) సున్నం వేసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం మెయిన్ వైరు రాజయ్య పట్టుకున్న ఇనుప నిచ్చెనకు తగిలి విద్యుద్ఘాతానికి గురయ్యాడు. రాజయ్యను రక్షించబోగా శివ కూడా కరెంట్షాక్కు గురయ్యాడు. దాంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు.
భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం కొల్లాపురం గ్రామానికి చెందిన బండారి సాల్మన్రాజు(35) పొలంలో పురుగుల మందు పిచికారీ చేశాడు. వారి చేను పక్కనే ఇనుప కంచె ఉంది. మోటారు కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ కంచెపై నుంచి వెళ్లింది. దాంతో వైరు కంచెకు తగిలి విద్యుత్ ప్రసారం అయింది. అది తెలియని సాల్మన్రాజు మందు పిచికారీ చేస్తూ కంచెను పట్టుకున్నాడు. దాంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. అతనికి భార్య, నలుగురు పిల్లలున్నారు.