Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హత్నూర్, జూలూరుపాడు
ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మంగళవారం ఈ ఘటనలు జరిగాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ముచ్చర్ల గ్రామంలో యాదగిరి, అరుణల కూతురు లక్ష్మి (మూడేం డ్లు) మధ్యాహ్నం సమయంలో ఆడుకుంటూ పోయి బాత్రూంలో ఉన్న నీటితొట్టిలో పడింది. కొద్దిసేపటి తర్వాత తల్లి కూతుర్ని వెతికింది. బాత్రూంలో నీటిలోపడి కన్పించడంతో వెంటనే బయటికి తీసింది. చికిత్స నిమిత్తం నర్సాపూర్లోని హాస్పిటల్కు తీసుకెళ్తుండగా పరిస్థితి విషమించి చిన్నారి మార్గమధ్యంలో మృతిచెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాంతండాకు చెందిన జాటోతు రమేష్, నాగమణిల కుమారుడు లోక్షిత్ (18 నెలలు) ఆడుకుంటూ వెళ్లి ఇంట్లో ఉన్న నీటితొట్టిలో పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు వెతకడంతో అప్పటికే విగతజీవిగా మారాడు.